రాజధానిలో
రాజకీయాలు..
గ్రేటర్
పరిధిలో ఐదు పార్లమెంటు స్థానాలు
ఉన్నాయి. అందులో సికింద్రాబాద్, హైదరాబాద్,మల్కాజ్ గిరి మూడు పార్లమెంటు
స్థానాలుగ్రేటర్ పరిధిలో ఉండగా చేవెళ్ల,భువనగిరి
పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అన్ని పార్టీలలో అతిరథ
నాయకులు గ్రేటర్ పరిధిలోనుంచే ప్రాతినిథ్యం వహించడం విశేషం.లోక్ సత్తా పార్టీ
జాతీయ అధ్యక్షులు,కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బీజేపీ
రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఎంఐఎం
అధ్యక్షులు అసదుద్దిన్ ఓవైసీతోపాటు జయసుధ వంటి నేతలు
ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.అయితే ఈ ఎన్నికల్లో
కొంతమంది నాయకులు కొత్త నియోజకవర్గాలను ఎంచుకునే
ఆలోచనలో ఉన్నట్లు తెలిస్తోంది.అయితే ఇప్పటికే కొన్ని
రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు
చేశాయి. నెల రోజుల క్రితమే
లోక్ సత్తా పార్టీ అభ్యర్థులను
ప్రకటించి ముందుంది. ఖరారైన అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. మిగతా పార్టీలు కూడా
అభ్యర్థుల ఎంపికలో తలామునకలయ్యాయి..
ఇప్పటివరకు రాజకీయ పార్టీల పొత్తులు ఖరారు కాలేదు. గత
ఎన్నికల్లో గ్రేటర్ లో బలంగా ఉన్న
మజ్లిస్.. కాంగ్రెస్ పార్టీలు అవగాహన ఒప్పందాన్ని పెట్టుకుని ఎన్నికల బరిలో నిలిచాయి.. మహాకూటమి
నుంచి టీడీపీ.. వామపక్షాలు..టీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయగా.. బీజేపీ
మాత్రం ఒంటరిపోరు చేసింది. అయితే లోక్ సత్తా
పార్టీ కూడా పొత్తులు పెట్టుకోలేదు..
రెండు పార్టీల అధ్యక్షులు అటు కిషన్ రెడ్డి..
ఇటు జయప్రకాష్ నారాయణ మాత్రమే విజయం సాధించారు.. అయితే
ఊహించని విధంగా కాంగ్రెస్ గ్రేటర్ లో అధిక స్థానాలను
గెలుచుకుంది.. కేవలం రాజేందర్ నగర్
నుంచి మాత్రమే టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు.. పాతబస్తీలో
మజ్లిస్ తన పట్టును నిలుపుకుంది.
అయితే ఈ సారి సిట్టింగ్
అభ్యర్థుల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి.. మారిన రాజకీయ పరిస్థితులు
పొత్తులు తమ స్థానాలు నిలబెట్టుకుంటామా
లేదా అనే ఆందోళనలో పడ్డారు..ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి పోలీసులు భారీ బలగాలను రంగంలోకి
దించుతున్నారు.. ఇప్పటికే 24 అసెంబ్లీలకు ఐదు పార్లమెంట్ స్థానాలకు
రిటర్నింగ్ అధికారులను నియమించారు. పొత్తులు ఖరారు కావడంతో పాటు
అభ్యర్థుల ఎంపికే మిగిలి ఉంది.
No comments:
Post a Comment