Wednesday, 23 July 2014

ఇఎస్ఐ కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం వల్ల రోగులకు కలుగుతున్న ఇబ్బందులపై మంత్రి నాయిని అగ్రహం....


సనత్ నగర్ ఇఎస్ఐ ఆసుపత్రిలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్...

ఇఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో సమస్యలను అడిగి తెలుసుకుంటున్న మంత్రి నాయిని నర్సింహా రెడ్డి....

ఇఎస్ఐ కార్పొరేషన్ ఆసుపత్రిలో పర్యటించిన హోం శాఖ మంత్రి నాయిని.....
తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; కేంధ్ర ప్రభుత్వ పరిధిలో కొనసాగుతున్న ఇఎస్ఐ కార్ఫొరేషన్ అధికారులు రోగుల పట్ల ఎటువంటి శ్రద్ద చూపకపోవడంపై  రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం సనత్ నగర్లో  ఇఎస్ఐ ఆసుపత్రిలో  కార్మిక ట్రేడ్ యూనియన్ల  నాయకుల ఆద్వర్యంలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా నాయిని మాట్లాడుతూ ఇఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చెందిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఈ ఆసుపత్రిలో సరియైన సేవలు లేకపోవడమే కాకుండా ఒక్క బెడ్ పై  ఇద్దరు రోగులు పడుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అత్యవసర సేవల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి పంపిస్తే అక్కడ కూడా అధికారులు  వారి పట్ల శ్రద్ద చూపకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్న రోగులను వారి ఆరోగ్యం పట్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు, ఇఎస్ఐ డైరెక్టర్ మల్లీశ్వర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రంగనాథన్, ఏఐటియుసి, సిఐటియు, బిఎంఎస్, టీఎన్ టియుసి, హెచ్ఎంఎస్ లకు చెందిన  ట్రేడ్ యూనియన్ల నాయకులు ఎం.సాయిబాబు, సత్యనారాయణ, సదానంద్ గౌడ్, మల్లేశం, బోసు, రాంబాబు, నర్సింహా, యూసుఫ్, ప్రకాశం గౌడ్, టీఆర్ఎస్ నాయకులు చలపతి రావు, పి.మనోహర్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment