ఎస్సార్ నగర్ లోని ఉమేష్ చంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి నివాసులు అర్పిస్తున్న డిజిపి ప్రసాదరావు
ఉమేష్ చంద్ర సేవలు మరువలేనివి; డిజిపి ప్రసాదరావు
తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్.... ఐపిఎస్ అధికారి ఉమేష్ చంద్ర వర్ధంతి సందర్బంగా గురువారం ఎస్సార్ నగర్ లో విగ్రహానికి హోం శాఖ ముఖ్య కార్యదర్శి బి.ప్రసాదరావు ఉమేష్ చంద్ర కుటుంబ సభ్యులు ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ప్రసాదరావు మాట్లాడుతూ ఉమేష్ చంద్ర ఆశయాలు యువ పోలీస్ ఆచరణలో పెట్టి ప్రజలకు న్యాయం చేయాలన్నారు. పోలీస్ శాఖలో క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరికి మంచి గౌరవంగా పలుకరించేవారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టిఎ డైరెక్టర్ అరుణ బహుగుణ, పోలీస్ ఉన్నతాధికారులు గౌతమ్, అదనపు డిసిపి నాగరాజు, పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎస్సార్ నగర్ సిఐ రమణా గౌడ్, ఎస్ఐలు అజయ్, సైదులు, సుదర్శన్ రెడ్డి తదితర సిబ్బందితో కలిసి నివాళులు అర్పించారు...
No comments:
Post a Comment